పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండల కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని బుధవారం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 134 మంది వారి సమస్యలపై అర్జీలు ఇచ్చారని వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కారం అవ్వటం అని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని వివిధ భాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.