ప్రకాశం జిల్లా ఒంగోలు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన రాష్ట్రానికి చేరుకున్నా రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియలేదని ఎవరన్నా ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తిస్తే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని రైల్వే పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్నామని రైల్వే పోలీసులు వెల్లడించారు.