కూకట్పల్లి జెఎన్టియు యూనివర్సిటీలో జరుగుతున్న డైమండ్ జూబ్లీ వేడుకల్లో భాగంగా శనివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, విసి కిషన్ కుమార్ రెడ్డి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు పూర్వ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.