ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో విషపూరితమైన కార్బో కార్పస్ మొక్కలను పంచాయతీ అధికారులు తొలగించే చర్యలను చేపట్టారు. గత ప్రభుత్వంలో రోడ్డుకు డివైడర్ మధ్యలో మొక్కలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ మొక్కలు భారీ ఎత్తున పెరిగాయి. దీంతో ఆ మొక్కల వల్ల శ్వాస కోసం వ్యాధులు వస్తాయని వైద్యాధికారులు చెప్పడంతో పంచాయతీ అధికారులు వాటిని తొలగించే చర్యలు చేపట్టారు.