శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని కనగానపల్లి మండలం తల్లిమడుగుల గ్రామానికి చెందిన సావిత్రమ్మ అనే వృద్ధురాలు చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు బుధవారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేరిన ఆమెకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్న క్రమంలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.