మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట జాతీయ రహదారిని ఆనుకొని ఏర్పాటు చేసిన టపాకాయల దుకాణం వలన ప్రమాదం చోటుచేసుకుని అవకాశం ఉందని పలువురు వాహనాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకొని జాతీయ రహదారి పక్కన ఉన్న దుకాణంలో కొనుగోలు చేసేందుకు రహదారిపై వాహనాలు నిలుపుతున్నారు. దీంతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని పలువురు కోరుతున్నారు.