మంత్రాలయం: మంత్రాలయం మండల కేంద్రంలో త్రీ స్టార్ హోటల్ కు సీఎం చంద్రబాబు వర్చువల్గా శంకుస్థాపన
మంత్రాలయం: మండల కేంద్రంలో త్రీ స్టార్ హోటల్కు సీఎం చంద్రబాబు మంగళవారం వర్చువల్గా శంకుస్థాపన చేశారు. పరిశ్రమలు, ఉపాధి కల్పనలో భాగంగా హోటల్ ఏర్పాటు చేయనున్నారు. అందరికీ ఉపాధి కల్పించాలన్నదే మన కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి అన్నారు. కార్యక్రమానికి ఎమ్మిగనూరు, ఆదోని ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.