పల్లి కొండేశ్వర స్వామి సేవలో జ్యోతుల నెహ్రూ నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీ పల్లికొండేశ్వర స్వామిని టీటీడీ పాలకమండలి సభ్యులు, జగ్గంపేట MLA జ్యోతుల నెహ్రూ బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ D. పద్మనాభ రాజు, ఇవో P.లత ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శనం చేయించారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు, స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.