మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోచారం ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీ ఉద్యోగి బోనుకొండ వరప్రసాద్ తన గ్లామర్ బైక్ పై ఉప్పల్ వైపు వెళ్తుండగా, జోడిమెట్ల క్రాస్ రోడ్స్ వద్ద వెనుక నుంచి వచ్చిన గ్యాస్ ట్యాంకర్ లారీ అతని బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వరప్రసాద్ రోడ్డుపై పడిపోవడంతో తలకు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.