పీలేరు మండల విఆర్ఓ ల సంఘం అధ్యక్షుడిగా బుక్కే హేమంత్ నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం పీలేరు తహశీల్దారు కార్యాలయంలో ఎన్నికలు ఏకగ్రీవం గా జరిగాయి. ఈ ఎన్నికల్లో విఆర్ఓల సంఘం మండల అధ్యక్షుడిగా గూడరేవుపల్లి గ్రామ పంచాయితీ విఆర్ఓ బుక్కే హేమంత్ నాయక్ ను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా దొడ్డిపల్లి విఆర్ఓ బత్తల యల్లప్ప, కార్యదర్శిగా బోడుమల్లువారిపల్లి విఆర్ఒ ఆర్.సిద్దయ్య,సంయుక్త కార్యదర్శిగా కాకులారంపల్లి విఆర్ఓ బండి అజయ్, కోశాధికారులుగా రేగళ్ళు విఆర్ ఒ పి.కవిత, బండ్లవంక విఆర్ఓ వి.కళ్యాణిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సలహాదారుగా బాలంవారిపల్లి విఆర్ ఒ జి.నారాయణ ఎన్నికయ్యారు