మాజేరు లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
Machilipatnam South, Krishna | Sep 25, 2025
చల్లపల్లి మండలం మాజేరులో నాగేంద్రస్వామి పుట్టకు వెళ్లే రోడ్డు పక్కన గుర్తు తెలియని పురుషుని మృతదేహం లభించింది. మృతుడి వయసు సుమారు 45-50 సంవత్సరాల మధ్య ఉంటుందని, చొక్కా, లుంగీ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై చల్లపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, మృతుడి వివరాలు తెలిసినవారు 8332983811 నంబర్కు సంప్రదించాలని కోరారు.