ఏలూరు జిల్లాకు చెందిన భక్తులు వెంకటాపురం నుంచి శ్రీశైలం వైపు పాదయాత్రగా బయలుదేరారు. అయితే బీములికలను క్షేత్రం సమీపానికి చేరుకున్న సమయంలో వారి బృందంలో ఉన్న ఓ మహిళ అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో కలకలం రేగింది.కొద్దిసేపటికి కూడా ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడే విధుల్లో ఉన్న అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది వెంటనే అప్రమత్తమై కైలాస ద్వారం పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ప్రారంభించారు. అడవి ప్రాంతం కావడంతో జాగ్రత్తగా అన్ని దారులలో వెతికారు. సుమారు మూడు గంటల పాటు శ్రమించి మహిళను కాపాడారు.