శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న భవనంలో మంటలు చెలరేగిన ఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం రూప్ లాల్ బజార్లో నిర్మాణంలో ఉన్న భవనంలో నిల్వ ఉంచిన చెక్క సామాన్లకు మంటలు అంటుకున్నాయి. ఒకసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.