జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో గురువారం ఉద్రిక్తత నెలకొంది. మూసాపేట డివిజన్ కి రావాల్సిన నిధుల విషయంలో జాప్యం చేస్తున్నారని డివిజన్ లో మౌలిక సదుపాయాల కొరతపై అధికారులను నిలదీసినందుకు తనను అరెస్టు చేశారని మూసాపేట కార్పొరేటర్ కొడిచెర్ల మహేందర్రెడ్డి అన్నారు. డివిజన్లో సమస్యలు పరిష్కరించేందుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తనను అక్రమంగా అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారని మండిపడ్డారు.