పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వ మెడికల్ సీట్లు అందకుండా కూటమి ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. ఆదివారం కొలిమిగుండ్ల మండలం బెలుంలో రచ్చబండ-కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డితో కలసి ఆయన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, పెరం సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.