కళ్యాణదుర్గం పోలీసులు మంగళవారం ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు 25 లక్షలు విలువ చేసే 32 బైకులను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ రవిబాబు వివరాలు వెల్లడించారు. చినబాబు, పాతయ్య అనే అంతర్ రాష్ట్ర దొంగలు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పాటు బొమ్మనహాల్ పరిధిలో 32 బైక్లు ఎత్తుకెళ్లారు. వారిని అరెస్టు చేసి బైక్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జడ్జి దొంగలను రిమాండ్కు ఆదేశించారు.