దాదులూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | Oct 22, 2025
అనంతపురం నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని కనగానపల్లి మండలం దాదులూరు వద్ద ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన గోపాల్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.