ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్ పరిధిలోని వినాయక నగర్ ఫేజ్ 3 లో 10 లక్షల నిధులతో నిర్మించనున్న సిసి రోడ్డుకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప్పల్లోని ప్రతి కాలనీ అభివృద్ధి కోసం తాను కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు బైరి నవీన్ గౌడ్, బద్రుద్దీన్, ఇంద్రయ్య,మహేష్,రవీందర్, చందు కాలనీ అధ్యక్షుడు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.