పీలేరు మండలం పీలేరు పట్టణంలోని అశ్విని హాస్పిటల్ ను బుధవారం సాయంత్రం జిల్లా అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఆసుపత్రిలో చికిత్సలు నిర్వహించి పలువురు అనారోగ్య బాధితుల వద్ద వేలకు వేలు దండుకుని చికిత్సలు నిర్వహించి అవి ఫెయిల్యూర్ కాగా అనారోగ్యంతో మరో ఆసుపత్రికి చేరి చికిత్స అనంతరం పిజిఆర్ఎస్ లో పలువురు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు డిఎంహెచ్ఓ తమ సిబ్బంది తో బుధవారం సాయంత్రం అశ్విని ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వాస్తవమని తేలడంతో సీజ్ చేశారు. డాక్టర్ శ్రమంత్ కుమార్ రెడ్డికి నోటీసులు అందజేశారు.