అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని గార్లదిన్నె మండలం కోటంక గ్రామానికి చెందిన గుర్రప్ప అనే వృద్ధుడు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు. శుక్రవారం అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడగా వారి కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.