కుషాయిగూడలో పోలీసు అమరవీరుల సంస్మరణ లో భాగంగా ట్రాఫిక్ సీఐ ఎన్ఎల్ఎన్ రాజు ఆధ్వర్యంలో ఆటోడ్రైవర్లతో కలిసి తులసి హాస్పిటల్ వద్ద ర్యాలీ నిర్వహించారు. ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటించాలని సూచించారు.