ఓయూలోని హాస్టల్స్ మెస్ లలో నాణ్యత లోపిస్తుందని పలుమార్లు విద్యార్థులు ఆందోళనకు దిగుతున్న సమస్య పరిష్కారం అవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మంగళవారం రాత్రి కుళ్ళిపోయిన భోజనం పెట్టారని విద్యార్థులు ధర్నాకు దిగారు. లో హాస్టల్ లో పరిస్థితి మరింత అద్వానంగా ఉందన్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు దీనిపై తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన భోజనం అందించే వరకు ఆందోళనలు ఆపేది లేదన్నారు.