గాజుల మండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మనోజ్ హత్య కేసు చేదించిన పోలీసులు
హత్య కేసు ఛేదించిన గాజులమండ్యం పోలీసులు గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మనోజ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సోమవారం గాజులమండ్యం పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ రవి మనోహరాచారి వివరాలు వెల్లడించారు. మృతుడు మనోజ్ పై దొంగతనం కేసులు ఉన్నాయని, అతని స్నేహితుడు హరి ప్రసాద్ భార్య గురించి తప్పుగా మాట్లాడడం హత్యకు కారణమైందన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు.