మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై చేపట్టిన తనిఖీల్లో 938 ఉల్లంఘనలు గుర్తించగా, 890 మంది భవన యజమానులకు నోటీసులు జారీ చేశారు. వీరిలో 70 మంది BPS కింద దరఖాస్తు చేసుకోగా, 48 దరఖాస్తులు పరిశీలించారు. వీటిలో పీనలైజేషన్ రుసుం ద్వారా మున్సిపాలిటీకి సుమారు రూ.29 లక్షల ఆదాయం లభించిందని పట్టణ ప్రణాళిక విభాగం అధికారిణి శాంతి తెలియజేశారు.