అనంతపురంలో ముఖ్యంగా యువత మరియు విద్యార్థులు గంజాయి సేవించి పెడదోవ పట్టకుండా మరియు అనారోగ్యం పాలు కాకుండా ఉండటం కోసం చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశించారు. ఈనేపథ్యంలో అర్బన్ సబ్-డివిజినల్ పోలీసు అధికారి శ్రీనివాస రావు గారి పర్యవేక్షణలో, అనంతపురము 1 టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు గంజాయి కట్టడికి చర్యలు చేపట్టారు. ప్రత్యేక నిఘా వేసి గంజాయి అక్రమ వ్యాపార మూలాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా గంజాయి అమ్ముచున్న షికారి శీనా ,షేక్ మహమ్మద్ ఖాన్ నవోదయ కాలనీ, హిందూ శ్మశాన వాటిక వద్ద సోమవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో అరెస్టు చేశామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.