రైతులకు సబ్సిడీ వేరుశనగ విత్తనాలు పంపిణీ: ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రైతులకు ఉచిత వేరు శెనగ విత్తనాలు పంపిణీ చేశారు. శనివారం ఉదయం పిచ్చాటూరు మండలంలోని సిద్ధిరాజు కండ్రిగ కు ఎమ్మెల్యే చేరుకొని రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే వేరు శెనగ విత్తనాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.