ప్రకాశం జిల్లా కొత్తపట్నం ప్రాంతాలలో కలెక్టర్ రాజాబాబు బుధవారం పర్యటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను కారణంగా తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాజబాబు ఆదేశించారు. జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని పునరావాస కేంద్రాలను కూడా సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎటువంటి పరిస్థితులైన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.