ప్రకాశం జిల్లా తాళ్లూరు మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయం నందు మహిళలకు ప్రకృతి వ్యవసాయంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏవో ప్రసాదరావు మాట్లాడుతూ తమకున్న భూమిలో 365 రోజులు ఆకుకూరలు పండ్లు ఉండేలా చూసుకుంటూ రసాయనాలు లేని ఉత్పత్తులు పండించుకోవాలని తెలిపారు. డ్వాక్రా మహిళలకు వ్యవసాయ శాఖ యాక్షన్ ప్లాన్లను వివరించారు. కార్యక్రమంలో ఏపిఎం దేవరాజు వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.