రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేయించడం దురదృష్టకరమని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి అన్నారు. సోమవారం నంద్యాలలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి పోరాటాల మధ్య రాయలసీమ దిక్కు తోచని స్థితిలోకి నెట్టబడుతుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన ప్రకటన రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది అని ఆరోపించారు.