ఎచ్చెర్ల: నందిగామ మండలం పాలవలస పేట గ్రామ సమీప జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు దంపతులకు తీవ్ర గాయాలు
శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పాలవలస పేట గ్రామ సమీప జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులకు కారు అధిక మించే క్రమంలో ద్విచక్ర వాహనాన్ని కారు స్వల్పంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు వాహనంలో ఆసుపత్రికి తరలించారు.