పుంగనూరు: రాంపల్లి సమీపంలో గల శాంతినగర్లో అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్న భార్యపై దాడికి పాల్పడ్డ భర్త, భార్య, బావమరిదికి గాయాలు
చిత్తూరు జిల్లా .పుంగనూరు. మండలం రాంపల్లి సమీపంలో గల శాంతినగర్లో కాపురం ఉంటున్న మణికంఠకు 7కు సంవత్సరాల క్రితం సరస్వతి తో పెద్దలు వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు మగసంతానం కలరు. మణికంఠ వేరే మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ తరచూ భార్యపై గొడవలు పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం పిల్లలతో నిద్రిస్తున్న భార్య సరస్వతి పై దాడికి దానికి పాల్పడ్డాడు.అడ్డు వచ్చినా బావమరిది అజిత్ పై దాడికి పాల్పడడంతో సరస్వతి, అజిత్ గాయపడ్డారు. దాడిలో గాయపడిన వారిని స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.