పూతలపట్టు: 36 లక్షల 86 వేల రూపాయల సీఎం సాహయనిధి చిక్కులను పంపిణీ చేసిన పూతలపట్టు ఎమ్మెల్యే
పూతలపట్టు నియోజకవర్గ పరిధిలో పేద ప్రజలకు సీఎం సహాయనిధి చెక్కులను సోమవారం ఎమ్మెల్యే డా. కలికిరి మురళీమోహన్ పంపిణీ చేశారు. పూతలపట్టు ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం రూ.36,86,156 విలువైన చెక్కులు లబ్ధిదారులకు అందజేశారు. ఐరాల, తవణంపల్లె, బంగారుపాలెం, యాదమరి, పూతలపట్టు మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులు వైద్య అవసరాల కోసం ఈ సహాయాన్ని పొందారు.