శ్రీకాకుళం: గార మండలంలో మూడు ప్రాంతాలలో జరుగుతున్న జూద శిబిరాలపై దాడులు చేశామన్న ఎస్సై గంగరాజు
గార మండలంలో మూడు ప్రాంతాలలో జరుగుతున్న జూద శిబిరాలపై దాడులు చేశామని ఎస్సై గంగరాజు తెలిపారు. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు జరిపిన ఈ దాడులలో భాగంగా 14 మందిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశామని వివరించారు. ఈ మేరకు వారి వద్ద నుంచి రూ.5,200 స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. అలాగే కొత్తూరు సైరిగాం గ్రామంలో ఆక్రమంగా నిల్వ ఉంచిన 38 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.