భార్యాభర్తల మధ్య గొడవలో సర్ది చెప్పడానికి వెళ్లిన అతను కత్తితో పొడిచి చంపిన అల్లుడు. బండి ఆత్మకూరు మండలం కడమకాల్వలో ఘటన
నంద్యాల జిల్లా బండిఅత్మకూరు మండలం కడమకాల్వ గ్రామంలో చిన్న చిన్న విషయాలకు గొడవలు పెట్టుకొనే అల్లుడు సునీల్ రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. ఈ గొడవలో అడ్డు వచ్చిన అత్త కళావతిని కత్తితో దారుణంగా పొడిచి చంపాడు.అల్లుడు సునీల్ చేసిన దారుణాన్ని చూసిన బంధువులు కొన ఊపిరితో ఉన్న అత్త కళావతిని నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో కళావతి చికిత్స పొందుతూ మరణించారు. కడమకాల్వ గ్రామంలో జరిగిన ఈ ఘటనపై బండిఅత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసి అల్లుడు సునీల్ కోసం గాలిస్తున్నారు.