మదనపల్లిలో కారు దొంగిలించుకొని వెళ్తున్న దొంగను అడ్డుకునే ప్రయత్నంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఓ కారును దొంగిలించుకొని దొంగ పరారు అవుతున్నాడని డైల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందింది. అప్పటికే జాతీయ రహదారిపై విధులలో ఉన్న కానిస్టేబుల్ నాయబ్ రసూల్ దొంగ కారును దొంగిలించుకొని పరారు అవుతుండడాన్ని గుర్తించాడు. దొంగ మొదట పోలీసులను చూసి కారు నిలిపాడు. తర్వాత కారుతో కానిస్టేబుల్ ని ఢీ కొట్టి కారును అక్కడే వదిలి పరారయ్యాడు.