జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) ద్వారా ఉచిత వైద్య పరీక్షలు, చికిత్సలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. ఈ.బి. దేవి తెలిపారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో డీఎంహెచ్వో డా. ఈ.బి. దేవి గారి ఆధ్వర్యంలో, ఆర్బీఎస్కే ఇన్ఛార్జ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ (ఎన్సీడీ) డా. విష్ణుమూర్తి గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జిల్లావ్యాప్తంగా సమర్థవంతంగా అమలవుతోందని పేర్కొన్నారు.