అరవకూర్ లో గొర్రెల కాపరి పై ఇద్దరు గొర్రెలు కాపర్ల దాడి ఓ గొర్రెల కాపరికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Sep 17, 2025
అనంతపురం జిల్లా కూడేరు మండలం అరవకూరులో బుధవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ఎల్లప్ప అనే గొర్రెల కాపరి పొలంలో గొర్రెల మేపుతుండగా మరొక ఇద్దరు గొర్రెలు కాపర్లు కృష్ణ, సీనా ఎల్లప్పపై కర్రలతో దాడి చేసి పరారయ్యారు. ఎల్లప్పకు తీవ్ర గాయాలు అవ్వడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎల్లప్పను ఆర్తో వార్డుకు తరలిస్తున్నామని అత్యవసర విభాగం వైద్యులు డాక్టర్ సౌమ్య తెలిపారు.