గుర్రంకొండ గ్రామ పంచాయతీ నందు "స్వచ్చ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర " కార్యక్రమంలో భాగంగా వ్యక్తి గత పరిశుభ్రత పైన అవగాహన ర్యాలీ ఎంపిడిఓ పరమేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో సెక్రెటరీ శ్రీహరి తమ సిబ్బంది తో పాటు వెలుగు, అంగన్వాడీ, సచివాలయ సిబ్బందితో కలిసి శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఎంపిడిఓ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ జి.పరమేశ్వర రెడ్డి, మాట్లాడుతూ ప్రతి మనిషికి వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరమని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత లేకపోతే అనారోగ్యం పాలవుతారని అన్నారు. అదే విధంగా పరిసరాల పరిశుభ్రత కూడా ఎంతో అవసరమని అన్నారు.