తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం రాచకున్నేరి రైల్వే గేటు సమీపంలో రైలు కింద తలపెట్టి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం సాయంకాలం చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే ఉత్తరాజి రాష్ట్రానికి చెందిన రాబి రాజ్వర్ అనే యువకుడు రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు సమీపంలోని ఓ కర్మాగారంలో పనిచేస్తున్న యువకుడు తోటి కార్మికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలనుంది