అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలం దయ్యాలమడుగు గ్రామానికి చెందిన శ్రీరాములు అనే వ్యక్తి నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బుధవారం అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా వారి కుటుంబ సభ్యులు అనంతపురం ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్న క్రమంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.