తాడిపత్రిలోని కృష్ణాపురం కాలనీలో మంగళవారం ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు పలు రకాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని సమస్యలను అక్కడకక్కడే పరిష్కరించారు. తన దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ దశల వారీగా పరిష్కారం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.