తాడిపత్రి లోని చైతన్య కాలనీలో గత శనివారం ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలి 8 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన వారిలో కొందరి అనంతపురం, ఇంకొందరిని బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో బెంగళూరులో చికిత్స పొందుతున్న ఏకాంబరయ్య మంగళవారం మృతి చెందినట్లు సీఐ శివగంగాధర్ రెడ్డి చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.