శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దంపతులు దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఆలయ రాజగోపాలం వద్దకు చేరుకున్న వీరికి ఆలయఈవో శ్రీనివాసరావు ,చైర్మన్ రమేష్ నాయుడు, అర్చకులు, వేద పండితులు ఆలయ మర్యాదలను అనుసరించి స్వాగతం పలికారు.అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు చాగంటి దంపతులు.వేద ఆశీర్వచనం మండపంలో చాగంటి వారి దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనం లేయగ,ఈవో శ్రీనివాసరావు స్వామి అమ్మవార్ల చిత్రపటం తీర్థవాదం ప్రసాదాలు అందజేశారు.