ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గాంధీనగర్ వద్ద చిన్న సుబ్బయ్యకు చెందిన కంది చేనులో గంజాయి మొక్కలు పెంపకం సాగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఎస్ఐ చౌడయ్య పోలీసులు తనిఖీలు చేపట్టారు. సుమారు 40 గంజాయి మొక్కలను ఎండబెట్టిన 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.