సంగారెడ్డి: పోలీసులకు ప్రత్యేక గ్యాస్ సౌకర్యం, సంగారెడ్డిలో గ్యాస్ ఆటోలను ప్రారంభించిన ఎస్పీ పారితోష్ పంకజ్
జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద సోమవారం, పోలీసు సిబ్బంది కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక గ్యాస్ ఆటోలను ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆన్లైన్లో గ్యాస్ బుక్ చేసుకుంటే రెండు రోజుల్లో ఇంటికి గ్యాస్ వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సిహెచ్ రఘునందన్ రావ్, ఏఆర్ డీఎస్పీ నరేందర్, ఆర్.ఐ.లు రామారావ్, రాజశేఖర్ రెడ్డి, డానియల్ పాల్గొన్నారు.