నంద్యాల జిల్లా బనగానపల్లెలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా ఈనెల 28వ తేదీన వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ప్రజా ఉద్యమ ర్యాలీని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మెంథా తుఫాను కారణంగా ప్రజా ఉద్యమ ర్యాలీని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తదుపరి కార్యాచరణ తేదీని త్వరలో ప్రకటిస్తామని వైసీపీ నాయకులు, కార్యకర్తలు గమనించాలన్నారు.