కలికిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఉపాధ్యాయులకు మండల స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారిని మదనపల్లి లో జరిగే నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. కలికిరి మండలం కలికిరి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సోమవారం మండల స్థాయిలో ఉపాధ్యాయులకు క్రికెట్ మరియు హ్యాండ్ బాల్ పోటీలను ఫిజికల్ డైరెక్టర్లు రెడ్డప్ప, మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన కలికిరి అభివృద్ధి కమిటీ చైర్మన్ రెడ్డి వారి యోగేష్ రెడ్డి, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు కే.ఎస్ షాబుద్దీన్, టీడీపీ కస్టర్ ఇంచార్జ్ బైరిశెట్టి రమేష్ బాబు ప్రారంభించారు