అనంతపురం నగరంలోని మద్యం విక్రయ షాపులను ఎక్సైజ్ శాఖ అధికారులు గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నకిలీ మద్యం పై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక చొరవతో ఆయా ప్రాంతాలలో ఆకస్మికంగా దాడులు చేపట్టారు. స్టాక్ పాయింట్ కు సంబంధించి స్కానింగ్ ద్వారా ప్రత్యేక నిఘా పెట్టారు.