క్రీడలో మానసిక శారీరక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని క్రీడా స్ఫూర్తితో పోటీల్లో రెవెన్యూ క్రీడాకారులో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు.శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆర్డిటి స్టేడియంలో ఏడవ రెవెన్యూ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల నిర్వహణలో భాగంగా జరిగిన వివిధ క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ పరవేక్షించారు. ఈ సందర్భంగా ఆయా క్రీడల క్రీడాకారులతో పరిచయం చేసుకొని వారిని ఉత్తేజపరిచారు. రెవెన్యూ క్రీడాకారులు పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలని గెలుపు ఓటమిలు సహజమేనని స్నేహపూర్వక వాతావరణంలోమూడు రోజులు పాటు జరిగిన క్రీడా పోటీలు పండుగ వాతావరణం తలపిస్తున్నట్లు తెలిపారు.