కడప జిల్లా ఇడుపులపాయ ఆర్జీయూకేటీ ఆర్ కే ర్యాలీ కి NSS యూనిట్ 11'13'14'15 ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలను తాళ్లపల్లి, కుమ్మరంపల్లి, కుమార్ కాలువ లో నిర్వహించారు. ఆయా గ్రామాలలో అక్షరాస్యత,రోడ్డు భద్రత,స్వేచ్ఛ భారత్ వంటి అంశాలపై అవగాహన మరియు ర్యాలీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేంపల్లి ఎస్సై తిరుపాల్ నాయక్, వేంపల్లి గ్రామపంచాయతీ ఈవో నాగభూషన్ రెడ్డి, ఏఎస్ఐ విజయ్ భాస్కర్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ దీప్తి రెడ్డి, యూనిట్ ఆఫీసర్లు తిరుపతిరెడ్డి, సుబ్బరాయుడు, గోవర్ధన్,మరియు 200 మంది విద్యార్థులు వాలంటీర్లు పాల్గొన్నారు.